గుమ్మడిదల మండల కేంద్రంలో రైతు సంఘం అధ్యక్షుడు సదానంద రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నిరసన ర్యాలీ చేపట్టారు. ప్యారా నగర్ లో డంప్ యార్డు వద్దంటూ నిరసన చేపట్టగా వారిని పోలీసులు అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని నాయకులు అన్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, చెన్నం శెట్టి ఉదయ్ కుమార్, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.