సంగారెడ్డి జిల్లా ఉమ్మడి జిన్నారం గుమ్మడిదల మండలాల్లో వర్షాలు అడపాదడపా పడుతుండడంతో రైతన్నలు పొలం పనుల్లో బిజీ అయ్యారు. ఇప్పటికే పొలాన్ని దుక్కి దున్ని సిద్ధం చేశారు. నారుమడ్లను కూడా ఏర్పాటు చేశారు. నీరు సమృద్ధిగా ఉండడంతో రైతన్నలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.