సిజిఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గుమ్మడిదల మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో నిర్వహిస్తున్న ఓపెన్ టు ఆల్ క్రీడా పోటీలు రెండవ రోజు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి స్థానిక నాయకులతో కలిసి క్రీడా పోటీలను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ కుమార్ గౌడ్, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, దేవేందర్ రెడ్డి, ట్రస్ట్ సభ్యులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.