
ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్
భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో ఐటీ కంపెనీలు అప్రమత్తమయ్యాయి. ఉద్యోగుల భద్రతకై కేపీఎంజీ ఇండియా, HCL టెక్నాలజీస్, ఈవై కంపెనీలు శుక్రవారం వరకు ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్కి అనుమతినిచ్చాయి. డెలాయిట్ ఇండియా అత్యవసరం కాని దేశ, విదేశీ ప్రయాణాలు నివారించాలని సూచించింది. టెక్ మహీంద్రా ఉద్యోగులు సోషల్ మీడియాలో వ్యాఖ్యలు చేయరాదని, కస్టమర్లతో మాట్లాడేటప్పుడు దాడుల గురించి ప్రస్తావించకూడదని తెలిపింది.