సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం ఊట్ల గ్రామానికి చెందిన గ్రామస్తులు శనివారం తిరుమల తిరుపతి దేవస్థానానికి తరలి వెళ్లారు. అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి భజనలు భక్తి గీతాలు ఆలపించనున్నారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు జహంగీర్ రెడ్డి లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.