సంగారెడ్డి జిల్లాలో తనిఖీలు చేసి 25 మంది నకిలీ వైద్యుల పై కేసు నమోదు చేయించినట్లు తెలంగాణ రాష్ట్ర మెడికల్ అసోసియేషన్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. సంగారెడ్డిలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వీరి వివరాలను జిల్లా వైద్యాధికారి కార్యాలయానికి పంపినట్లు చెప్పారు. సమావేశంలో డాక్టర్ చక్రపాణి డాక్టర్ ఆనంద్ పాల్గొన్నారు.