సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బదిలీ అయిన ఉపాధ్యాయులను పాఠశాలలో గురువారం ఘనంగా సన్మానించారు. ప్రధానోపాధ్యాయుడు విద్యాసాగర్ మాట్లాడుతూ బదిలీ అయిన ఉపాధ్యాయులు పాఠశాలలో ఉత్తమ సేవలు అందించినట్లు చెప్పారు. పిఆర్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి మదన గోపాల్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు బదిలీలు సహజమేనని అని చెప్పారు.