జిల్లా వైద్యశాఖ ఆధ్వర్యంలో వివిధ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు టీబీ వ్యాధిపై సంగారెడ్డి లోని హోటల్లో అవగాహన సమావేశం మంగళవారం నిర్వహించారు. జిల్లా పరిశ్రమల శాఖ అధికారి ప్రశాంత్ కుమార్ మాట్లాడుతూ టీబీ వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పారు. జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో నివారణ అధికారి రాజేశ్వరి పాల్గొన్నారు.