రైతుల సంక్షేమం కోసమే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అమలు చేస్తుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. కొండాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలోని భూభారతి సదస్సులు శుక్రవారం నిర్వహించారు ముఖ్యఅతిథిగా హాజరైన కలెక్టర్ మాట్లాడుతూ మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసినట్లు చెప్పారు. ప్రతి గ్రామంలో సదస్సులు నిర్వహించి, రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసిల్దార్ అశోక్ పాల్గొన్నారు.