సంగారెడ్డి పట్టణం పోతిరెడ్డిపల్లి విద్యానగర్ రోడ్ నెంబర్ 4లోని దీపికా క్లాత్ ఎంపోరియం యజమాని నివాసంలో బ్రహ్మ కమలాలు విరబూసాయి. సంవత్సరంలో ఒకసారి మాత్రమే పూసే బ్రహ్మ కమలాలు పూయడంతో కాలనీలో పండుగ వాతావరణం కనిపించింది. కాలనీ వాసులు బ్రహ్మ కమలాలకు పూజలు జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు.