సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలోని జిఎంఆర్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు పురస్కారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.