ఖమ్మం జిల్లా అశ్వరావుపేట ఎస్సై శ్రీరాములు మృతి పై విచారణ జరిపించాలని కోరుతూ దళిత సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని ప్రభుత్వ అతిథిగృహం వద్ద బుధవారం నిరసన తెలిపారు. నాయకులు మాట్లాడుతూ సిఐ జితేందర్ రెడ్డి అహంకారం వల్లే ఎస్సై ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో దళిత సంఘాల నాయకులు దుర్గాప్రసాద్, ఇమ్మయ్య, ప్రవీణ్, వేణుగోపాల్, సాగర్, ఆనంద్ పాల్గొన్నారు.