ప్రతి ఒక్కరు హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేయాలని ప్రముఖ ఆధ్యాత్మికవేత అమోగ్ అన్నారు. సంగారెడ్డి పట్టణంలో విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ హిందువులు ఐక్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలుగుతారని చెప్పారు. సనాతన ధర్మాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు ముందుకు రావాలని కోరారు.