

దీపం పథకం బుకింగ్ కు ముందే ఖాతాల్లో నగదు జమ (వీడియో)
AP: దీపం పథకం కింద సిలిండర్ బుకింగ్ కంటే ముందే నగదు చెల్లింపులు చేయాలని టీడీపీ పొలిట్ బ్యూరో బుధవారం నిర్ణయం తీసుకుంది. ఏడాదిలో 3 సిలిండర్ల నగదును ఒకేసారి చెల్లించనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. లబ్ధిదారులు సిలిండర్ ఎప్పుడు బుక్ చేసుకున్నా, తీసుకోకపోయినా 3 సిలిండర్ల నగదు ఒకేసారి వారి ఖాతాల్లో వేసేలా నిర్ణయం తీసుకున్నామన్నారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం రెండు నెలల్లో ప్రారంభిస్తామని పేర్కొన్నారు.