
రాజ్ తరుణ్, లావణ్య వివాదంలోకి అరియానా ఎంట్రీ
గత కొన్ని రోజులు హీరో రాజ్ తరుణ్, లావణ్యల మధ్య అనేక విషయాల్లో గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి లావణ్య ఇంటి ముందు రాజ్ తరుణ్ తల్లిదండ్రులు గొడవకు దిగారు. దీంతో లావణ్య గురువారం పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉండగా బిగ్బాస్ ఫేమ్ అరియానా గ్లోరిని వివాదంలోకి లాగింది. 2021లో రాజ్ తరుణ్, అరియానాలు తనకు ఫోన్ చేసి బెదిరించారని ఆరోపించింది. రాజ్ తరుణ్ను వదిలేయాలంటే ఎంత డబ్బు కావాలో చెప్పాలంటూ అడిగిందని పేర్కొంది.