రైతుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అంబికా సోని అన్నారు. సంగారెడ్డి మండలం ఇస్మాయిల్ ఖాన్ పేట లోని పిఎసిఎస్ కార్యాలయంలో రైతుల అభిప్రాయ సేకరణ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రైతు భరోసా పై రైతులు చెప్పిన అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. మండల వ్యవసాయ శాఖ అధికారి ప్రసాద్ పాల్గొన్నారు.