సంగారెడ్డి పట్టణం శ్రీనగర్ లో వెలిసిన శ్రీ క్షేత్రంలోని లక్ష్మీ నరసింహ స్వామి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ నరసింహ స్వామి మూర్తులకు 108 కళాశాలలో చెరుకు రసాలతో ప్రత్యేకంగా అభిషేక కార్యక్రమాలను జరిపించారు. స్వామి వారికి వెండి ఆభరణాలతో ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో లక్ష్మీనరసింహస్వామి మూర్తులను దర్శించుకున్నారు.