కలరియ పట్టు ముగింపు శిక్షణ కార్యక్రమం

82చూసినవారు
సంగారెడ్డి మండలం ఫసల్వాదిలోని శ్రీ జ్యోతిర్వాస్తు విద్యాపీఠంలో కలరియ పట్టు ముగింపు శిక్షణ కార్యక్రమం శుక్రవారం రాత్రి నిర్వహించారు. టీజీఐఐటి చైర్ పర్సన్ నిర్మల రెడ్డి, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ముఖ్య అతిథులుగా పాల్గొని శిక్షణ పొందిన విద్యార్థులకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ విద్యాపీఠం ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. విద్యాపీఠం వ్యస్థాపకులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ మహేశ్వర శర్మ సిద్ధాంతి మాట్లాడుతూ 131 మంది విద్యార్థులకు కలరియ పట్టు శిక్షణ 16 రోజులపాటు నిర్వహించినట్లు చెప్పారు. జూన్ నుంచి మళ్లీ ప్రతి ఆదివారం ఈ శిక్షణ కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో విద్యాపీఠం సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్