తొలి ఏకాదశి సందర్భంగా సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠపురం దేవాలయంలో ఈనెల 17వ తేదీన ఉదయం 11 గంటలకు లక్ష తులసి అర్చన నిర్వహిస్తున్నట్లు దేవాలయ కమిటీ సభ్యులు మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. మహిళలు తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని అర్పిస్తారని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని దేవాలయ కమిటీ సభ్యులు కోరారు.