రాజీవ్ యువ వికాసం పథకానికి సిబిల్ స్కోర్ నిబంధన తొలగించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ డిమాండ్ చేశారు. సంగారెడ్డి లోని కేకే భవన్ లో బుధవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అర్హులైన యువతకు సబ్సిడీ లోన్లు వెంటనే ఇవ్వాలని కోరారు. కాంక్షలు పెట్టడంతో యువత నష్టపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. అర్హులందరికీ యువవికాసం పధకం ఇవ్వకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.