సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మన్ సాన్ పల్లీ స్థానిక పాఠశాల ఉపాధ్యాయులు బుధవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. తిరిగి విద్యార్థుల తల్లిదండ్రులని ప్రభుత్వ పాఠశాలపై అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. పాఠశాలలలో మెరుగైన విద్య అందుతుందని.. పిల్లలను ప్రభుత్వ బడిలో చేర్పించాలని సూచించారు.