పటాన్చెరు మండలం పాశమైలారం పారిశ్రామికవాడలోని ఇస్నాపూర్ గ్రామ మత్స్యకారులను ప్రత్యేకంగా పరిగణించాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టేడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ కోరారు. శుక్రవారం ఇస్నాపూర్ మత్స్యకార సోదరులతో కలిసి తెలంగాణ రాష్ట్ర దేవాదాయ, ఎన్విరాన్మెంట్ శాఖ మంత్రి, ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి కొండా సురేఖని హైదరాబాద్ లోని వారి నివాసంలో కలిసి మత్స్యకారుల సమస్యపై వినతి పత్రం అందించారు.