
సరిహద్దు రాష్ట్రాలలో బ్లాక్ అవుట్ ఆంక్షలు ఎత్తివేత
అమెరికా మధ్యవర్తిత్వంతో భారత్- పాక్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి క్రమేపీ మెరుగుపడుతోంది. ఈ నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రం బ్లాక్ అవుట్ ఆంక్షలను పూర్తిగా ఎత్తివేసింది. గుజరాత్లోని కచ్ జిల్లాలో కూడా ఆంక్షలు సడలించబడ్డాయి. జమ్మూకశ్మీర్లోని పూంఛ్లో శాంతి నెలకొనడంతో స్థానికులు స్వీట్లు పంచుకుంటూ సంబరాలు జరిపారు.