సంగారెడ్డి పట్టణంలోని బొబ్బిలి కుంట చెరువు కట్ట పై రోడ్డు అధ్వానంగా మారింది. చెరువు కట్టపై గుంతలు ఉండడంతో చిన్నపాటి వర్షానికి బురదమయంగా మారుతుంది. శాంతినగర్ నుంచి ముగ్దుమ్ నగర్ వరకు ఈ కట్ట మీద నుంచి ప్రజలు ప్రయాణిస్తారు. కట్టపై బురదమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. అధికారులు స్పందించి మొరం వేయించాలని కోరుతున్నారు.