బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్, హరీష్ రావు ఎప్పుడైనా ప్రోటోకాల్ పాటించారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గాంధీభవన్లో మంగళవారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వీరిద్దరూ ప్రోటోకాల్ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదని చెప్పారు. గత ఎన్నికల్లో గెలిచిన తనను పక్కన పెట్టి ఓడిపోయిన వ్యక్తితో శంకుస్థాపనలు హరీష్ రావు చేయించలేదా అని ప్రశ్నించారు.