సంగారెడ్డి పట్టణంలోని సాహితీ హాస్పిటల్ ఆవరణలో సాహితీ హాస్పిటల్ డైరక్టర్ రాము ఆధ్వర్యంలో శనివారం రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదాన శిబిరాన్ని టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజి అనంత కిషన్ తో కలసి TGIIC చైర్ పర్సన్ నిర్మల జగ్గారెడ్డి ప్రారంభించారు. 75 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేసినట్లు సాహితీ రాము పేర్కొన్నారు. రక్తదానం చేసిన వారికి పండ్లు అందజేశారు.