సిగాచి పరిశ్రమ ప్రమాదంలో మరణించిన కార్మికుల కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుతూ సీపీఎం ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శనివారం ధర్నా నిర్వహించారు. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్కారాములు మాట్లాడుతూ మరణించిన కుటుంబాలకు రూ. కోటి, గాయపడిన వారికి రూ. 50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.