సంగారెడ్డి పట్టణ శివారుని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో కృత్తికా నక్షత్ర వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి పంచామృతాలతో ప్రత్యేక అభిషేక కార్యక్రమాలను జరిపించారు. దేవాలయ కమిటీ చైర్మన్ తోపాజి అనంత కిషన్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలను నిర్వహించారు. మహిళలు లలిత సహస్ర పారాయణం చదివి కుంకుమార్చనలు చేశారు. అమ్మవారి పల్లకి సేవా కార్యక్రమాన్ని జరిపించారు.