ఉమ్మడి సంగారెడ్డి జిల్లాలో 3 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. మంగళవారం, బుధవారం, గురువారం పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని చెప్పారు. రాబోయే 3 రోజులు కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ ఉదయం వేళల్లో పొగమంచు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. చలి దృష్ట్యా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.