దేశంలో ఎన్నో ఖనిజాలు దాగి ఉన్నాయని, వాటిని గుర్తించి దేశ ఆర్థిక అభివృద్ధికి తోడ్పడేలా ఆస్ట్రేలియాతో ఒప్పందం చేసుకోవడం అభినందనీయమని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. కంది ఐఐటీలో రెండు రోజుల వర్క్ షాప్ను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ. నెహ్రూ ఆలోచనలు నుంచి పుట్టింది ఐఐటీలని చెప్పారు. సంగారెడ్డిలో ఐఐటీ ఏర్పాటుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు.