మైనార్టీ గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్య అందుతుందని కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. సంగారెడ్డిలోని క్యాంపు కార్యాలయంలో ఐదో తరగతిలో ప్రవేశ కరపత్రాలను బుధవారం ఆవిష్కరించారు. నిష్ణాతులైన ఉపాధ్యాయులు గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నారని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్సీఓ బహుమతి, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.