సంగారెడ్డి జిల్లా మనూరు మండలం బాదలగావ్లోని పంచలింగేశ్వర ఆలయంలో ఏప్రిల్ 20న శివపార్వతుల కళ్యాణ మహోత్సవం జరుగుతుందని ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఆలయాన్ని ముస్తాబు చేసి అలంకరించినట్టు చెప్పారు. సద్గురు పంచవటి క్షేత్ర పీఠాధిపతి కాశీనాథ్ బాబా నేతృత్వంలో కళ్యాణ మహోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఆలయ సభ్యులు కోరారు.