విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రమేష్ అన్నారు. సంగారెడ్డి లోని మహాత్మ జ్యోతిబాపూలే బిసి బాలుర పాఠశాలను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకుల పాఠశాలను వంటగదితో పాటు భోజన నాణ్యతను పరిశీలించారు. విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు.