సంగారెడ్డి: శ్రీ వైకుంఠపురంలో సుదర్శన నరసింహ హోమం

70చూసినవారు
సంగారెడ్డి పట్టణ శివారులోని శ్రీ వైకుంఠపురం ఆలయంలో సుదర్శన నరసింహ హోమ కార్యక్రమం శనివారం ఘనంగా నిర్వహించారు. దేవాలయ ప్రధాన అర్చకులు కందాడై వరదాచార్యులు ఆధ్వర్యంలో హోమ కార్యక్రమం జరిగింది. భక్తులు జై శ్రీమన్నారాయణ అంటూ పెద్దఎత్తున నామస్మరణ చేశారు. అనంతరం వెంకటేశ్వర స్వామి పల్లకి సేవా కార్యక్రమాన్ని నిర్వహించారు.

సంబంధిత పోస్ట్