సంగారెడ్డి నియోజకవర్గంకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏం అభివృద్ధి చేసిందని కాసాల బుచ్చిరెడ్డి ప్రశ్నించారు. సంగారెడ్డి లోని ఎమ్మెల్యే క్యాపు కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఆందోలుకు అభివృద్ధి పనులు తీసుకువెళ్తే ఇక్కడి నాయకులు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. గత ప్రభుత్వ హయాంలోని పనులను ఇప్పుడు ప్రారంభిస్తున్నారని ఆరోపించారు.