సంగారెడ్డి పట్టణంలోని బాలాజీ నగర్ లో మురుగు కాలువలు లేకపోవడంతో ఇళ్ల ముందు చేరి దుర్గంధం వస్తుందని స్థానికులు మంగళవారం తెలిపారు. దోమల తీవ్రత కూడా ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. మరుగు నిల్వ ఉండకుండా చూడాలని మున్సిపల్ అధికారులకు విన్నవించిన పట్టించుకోవడంలేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలని కోరుతున్నారు.