జిల్లాలో బాలికలు, మహిళల రక్షణ కోసం షీ టీమ్స్ పనిచేస్తున్నాయని ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. సంగారెడ్డి జిల్లా ఎస్పీ కార్యాలయంలో షీ టీమ్స్ సమావేశం శనివారం నిర్వహించారు. మహిళలు ఎక్కడైనా వేధింపులకు గురైతే 8712656772 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని చెప్పారు. మహిళలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.