సంగారెడ్డి పట్టణం శ్రీనగర్ లో వెలిసిన శ్రీ క్షేత్రంలో స్వాతి నక్షత్ర వేడుకలు ఈనెల 15వ తేదీన నిర్వహిస్తున్నట్లు దేవాలయ నిర్వాహకులు నాయికోటి రమేష్ కుమార్ ఆదివారం తెలిపారు. సాయంత్రం 6 గంటలకు లక్ష్మి నరసింహ స్వామి మూర్తులకు ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు జరుగుతాయని చెప్పారు. 7 గంటలకు స్వామివారి కల్యాణోత్సవ కార్యక్రమం నిర్వహిస్తామని పేర్కొన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.