సదాశివపేట పరిధిలోని గం చారిటీ సిటీలో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరినట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ అన్నారు. సంగారెడ్డిలో శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. సెప్టెంబర్ 1వ తేదీలోపు వారిపై చర్యలు తీసుకోకుంటే తానే వారికి బుద్ధి చెప్తారని పేర్కొన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.