ఉపాధ్యాయ బదిలీలకు సంబంధించి సీనియార్టీ జాబితాలు ఫలితంగా ప్రకటించి కేటగిరి ఉన్న వారి వివరాలు సమగ్రంగా పరిశీలించి స్పౌజ్ కేటగిరి నందు నిబంధనలకు లోబడి ఉన్న వారిని మాత్రమే అనుమతించాలని కోరుతూ పిఆర్టియు సంఘం నాయకులు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శనివారం కలిసి విజ్ఞప్తి చేశారు. ఆయా మండలాల్లోని ఎస్జిటి ఖాళీలను పూర్తిగా ప్రకటించాలని కోరారు. కార్యక్రమంలో పిఆర్టియు టిఎస్ సంఘం నాయకులు పాల్గొన్నారు.