హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి లో జిల్లా 27వ తేదీన జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే చింత ప్రభాకర్ కోరారు. సంగారెడ్డిలో బుధవారం ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ. సభకు నియోజకవర్గం నుంచి కార్యకర్తలు భారీ సంఖ్యలో తరలిరావాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు మాణిక్యం, బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.