కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడంలేదని సీఐటీయు రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు విమర్శించారు. సంగారెడ్డి లోని కేకే భవన్ లో శనివారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నాలుగు లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 20వ తేదీన నిర్వహించే సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మల్లేశం, కార్యదర్శి సాయిలు పాల్గొన్నారు.