సంగారెడ్డి: రేపు లక్ష్మీ నరసింహ స్వామి జయంతోత్సవాలు

70చూసినవారు
సంగారెడ్డి పట్టణం శ్రీనగర్ లో వెలిసిన శ్రీ క్షేత్రంలో లక్ష్మీనరసింహస్వామి జయంతి వేడుకలు శనివారం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు నాయి కోటి రమేష్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీశ్రీశ్రీ మధవానంద స్వామి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఉదయం 8 గంటలకు 108 కళశాలతో చెరుకు రసాలతో ప్రత్యేక అభిషేకాలు నిర్వహిస్తామని చెప్పారు. సాయంత్రం 6 గంటలకు కళ్యాణోత్సవం జరుగుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్