డ్రగ్స్ కు యువత దూరంగా ఉండాలని ఎస్పి రూపేష్ సూచించారు. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో రూపొందించిన పోస్టర్లను బుధవారం ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలని సూచిస్తూ యువజన సంఘం ప్రచారం చేయడం అభినందనీయమని చెప్పారు. కార్యక్రమంలో నాయకులు మాణిక్, యాదగిరి, అశోక్ పాల్గొన్నారు.