
నటి కరిష్మా కపూర్ మాజీ భర్త మృతి
ప్రముఖ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త సంజయ్ కపూర్ (53) కన్నుమూశారు. యూకేలో పోలో ఆడుతూ గుండెపోటుతో తుది శ్వాస విడిచారు. ఈ విషాద వార్తతో సినీ ప్రముఖులు, కుటుంబ స్నేహితులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. కరిష్మా-సంజయ్ 2003లో పెళ్లి చేసుకుని, 2014లో విడిపోయారు. వీరికి ఇద్దరు పిల్లలు సమైరా, కియాన్ ఉన్నారు. విడాకుల తర్వాత సంజయ్ ప్రియా సందేవ్ను వివాహం చేసుకోగా, కరిష్మా ఒంటరిగా జీవిస్తున్నారు.