నారాయణాఖేడ్ మున్సిపల్ కేంద్రంలో ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో రాజీవ్ కూడలి బస్టాండ్ వద్ద చలివేంద్రం ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని కోరారు.