దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకీ సంగమేశ్వర స్వామి దేవాలయానికి శనివారం కుటుంబ సమేతంగా సంగారెడ్డి జిల్లా ఎస్పీ చెన్నూరి రూపేష్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం గర్భగుడిలోని పార్వతీ సమేత సంగమేశ్వర స్వామికి రుద్రాభిషేకం నిర్వహించారు. ఆలయ ఆవరణలోని అమృత గుండంలో జల లింగానికి ప్రత్యేక పూజలు చేసి గుండం పూజా నిర్వహించారు.