జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ గా ఎస్సై ఎం. కాశీనాథ్ గురువారం పదవి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ మండలంలో శాంతి పరిరక్షణ భద్రతకు కృషి చేస్తామన్నారు. అసాంఘిక కార్యక్రమాలు, జూదం, అక్రమ మద్యం, తదితర వాటిపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. పోలీసు సిబ్బంది నూతన ఎస్సైకి శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడ ఎస్సై ప్రసాద్ రావు సీఐగా ప్రమోషన్ పొంది బదిలీపై సంగారెడ్డి వెళ్లారు.