జహీరాబాద్ శాసన పరిధిలోని ఝరసంఘం మండలం జీర్లపల్లి గ్రామంలోని జెడ్ పి హెచ్ ఎస్ పాఠశాలలో శుక్రవారం ముందుగానే సంక్రాంతి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు రంగురంగుల ముగ్గులతో అందరినీ ఆకట్టుకున్నారు. ప్రధానోపాధ్యాయుడు నిర్వహించిన ఈ రంగోలి కార్యక్రమంలో ముగ్గులు వేసిన చిన్నారులకు గిఫ్టులు అందించారు.