మొగుడంపల్లిలో మండలంలో తప్పుల్లేని ఓటరు జాబితా సిద్ధం చేయడమే లక్ష్యంగా బూత్ లెవల్ అధికారులు (బీఎల్వోలు) కృషి చేయాలని నాయబ్ తహసిల్దార్ జుబేర్ హైమద్ తెలిపారు. శనివారం పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎల్వోలకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆన్లైన్ విధానంలో ఓటర్ల నమోదు ప్రక్రియపై స్పష్టతనిచ్చే విధంగా మాస్టర్ ట్రైనర్లు అవగాహన కల్పించారు.